శాసనసభను గత మూడు రోజుల నుంచి కుదిపివేస్తున్న మద్యం ముడుపుల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సెల్ఫ్గోల్ చేసుకుందన్న అంతర్మథనం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. మంత్రి కన్నా, మోపిదేవి తమ అధినేత మీద విరుచుకుపడుతుంటే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దన్నుగా రాకపోగా, పెళ్ళిళ్ల పేరిట ముఖం చాటేయడం విమర్శలకు తావిస్తోంది. చర్చను ప్రారంభించిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆది నుంచి బాబుపై అనూహ్యంగా విరుచుకుపడ్డారు. అసలు ఆరోజు సభలో కన్నానే హైలెట్గా నిలిచారు. గతం, వర్తమానం నాటి అంశాలను ప్రస్తావిస్తూ బాబును తూర్పారపట్టారు.
ఆయనతో పాటు మోపిదేవి కూడా టీడీపీపై విరుచుకుపడ్డారు. అయితే, కన్నా నిర్నిరోధంగా బాబుపై ఒంటికాలితో లేచినా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలెవరూ ఎదురుదాడి చేయకపోవడం, వారి బదులు బాబు-గాలి ప్రత్యారోపణలు చేయటం వల్ల తమ పక్షం ఆత్మరక్షణలో పడినట్టయిందని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు తమ పార్టీ, అధినేతపై విరుచుకుపడుతున్నప్పటికీ ధూళిపాళ్ల నరేంద్ర మినహా మరెవరూ ముందుకురాకపోవడం అటుంచి, అసలు సభలో లేకపోవడం బట్టి తమ ఎదురుదాడి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు. స్వయంగా సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఉన్నప్పటికీ, ఆయన కూడా ఎక్కడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండురోజులు సెలవులు వచ్చిన సందర్భంగా కనీసం జిల్లాలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఎదురుదాడి చేయకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ నేతలతో వ్యాపార సంబంధాలు ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నాయో స్పష్టమవుతోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం అధినేతకు తెలిసినా ఏమీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫలితం అనుభవించవలసి వస్తోందని చెప్పారు. కన్నా చర్చ ప్రారంభిస్తారని, మాటలకు పదునుపెట్టడంతో పాటు, ప్రత్యర్థులపై రాజకీయంగా విరుచుకుపడే ఆయన ధాటికి బ్రేక్ వేయాలంటే గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ముందుండాలని, కానీ వారంతా పెళ్లిళ్ల పేరిట మాయమయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రులపై విలేకరుల సమావేశం నిర్వహించాలని సూచించినా, ఒక్కరూ నిర్వహించిన దిక్కులేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన పత్తిపాటి పుల్లారావు విఫమలయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వినుకొండ వెళ్లిన ఆయన అక్కడ కనీసం మీడియా వద్ద కూడా మంత్రులపై మాట్లాడకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ జిల్లాలో కొందరు ప్రముఖులు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులతో వ్యాపార, రాజకీయ సంబంధాలు నిర్వహిస్తున్నందుకే ఈ దుస్థితి ఏర్పడిందని, దాని ప్రభావం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించిందని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పొన్నూరు మునిసిపాలిటీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతుదారులయిన కాంట్రాక్టర్లను పక్కకుపెడితే, నరేంద్రను ఎక్కువ మాట్లాడకుండా దారికి తెచ్చెకోవచ్చని స్వయంగా జిల్లా పార్టీ ప్రముఖుడే మంత్రి మోపిదేవికి సలహా ఇచ్చారన్న వార్తలు తమ పార్టీలో అంతర్యుద్ధాన్ని సూచిస్తున్నాయంటున్నారు. లాబీలో ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకోమని సలహా ఇస్తున్నారని, అధికారులతో మాట్లాడి పోరాడే బదులు మంత్రులతో కార్యకర్తల ముందే ఫోన్లు చేస్తుంటే ఇక కార్యకర్తల్లో పోరాటతత్వం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వ్యాపారాలు, రాజకీయ సంబంధాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నా వారిపై బాబు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్ధితి నెలకొందని పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకయినా సిద్ధమేనని బాబు తరచూ చెప్పడమే తప్ప, ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంవల్లే క్రమశిక్షణారాహిత్యం పెరిగిందంటున్నారు.
కాగా, మద్యం ముడుపుల వ్యవహారంలో మంత్రి కన్నా మాట్లాడతారని ముందే తెలిసినా ఆ మేరకు సమర్ధులను ఎంపిక చేసుకోవడంలో తాము వైఫల్యం చెందామని టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్థుడే అయినప్పటికీ, ఈ అంశం రాజకీయాలతో ముడిపడినందున, పార్టీ మారి వచ్చిన గాలితో మాట్లాడించడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎకై్సజ్ మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వరరావునో, బాగా మాట్లాడగల పయ్యావుల కేశవ్ గానీ, కన్నా జిల్లా అయినందున ధూళిపాళ్లను గానీ, ప్రత్యర్ధులపై దూకుడుగా వెళ్లే రేవంత్రెడ్డితో గానీ మాట్లాడిస్తే బాగుండేదంటున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం ఆ జిల్లాకు చెందిన పత్తిపాటి పుల్లారావునయినా మాట్లాడించవలసిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, బాబు నేరుగా మంత్రులపై విమర్శలు చేయటం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం వరకూ చెప్పి, మంత్రులపై ఆరోపణలు చేసే బాధ్యతను మిగిలిన వారికి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ‘మా సార్ తన గురించి ఎక్కువ చెప్పుకోవడం మానుకోవాలన్నది మా అభిప్రాయం. ఆయన స్థాయిలో మంత్రులపై విమర్శలు చేయకూడదు. ఆ పనిని మాలాంటి వాళ్లకు అప్పగిస్తే సరిపోతుంది. అన్నీ తానే చూసుకోవాలన్న విధానం ఇంకా మానుకోలేకపోతున్నార’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తొలిరోజు సభలో పైచేయి సాధించిన తాము రెండోరోజు చేతులెత్తేయడానికి వ్యూహరచన లోపమేనని అంగీకరిస్తున్నారు.
ఆయనతో పాటు మోపిదేవి కూడా టీడీపీపై విరుచుకుపడ్డారు. అయితే, కన్నా నిర్నిరోధంగా బాబుపై ఒంటికాలితో లేచినా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలెవరూ ఎదురుదాడి చేయకపోవడం, వారి బదులు బాబు-గాలి ప్రత్యారోపణలు చేయటం వల్ల తమ పక్షం ఆత్మరక్షణలో పడినట్టయిందని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు తమ పార్టీ, అధినేతపై విరుచుకుపడుతున్నప్పటికీ ధూళిపాళ్ల నరేంద్ర మినహా మరెవరూ ముందుకురాకపోవడం అటుంచి, అసలు సభలో లేకపోవడం బట్టి తమ ఎదురుదాడి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు. స్వయంగా సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఉన్నప్పటికీ, ఆయన కూడా ఎక్కడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండురోజులు సెలవులు వచ్చిన సందర్భంగా కనీసం జిల్లాలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఎదురుదాడి చేయకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ నేతలతో వ్యాపార సంబంధాలు ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నాయో స్పష్టమవుతోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం అధినేతకు తెలిసినా ఏమీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫలితం అనుభవించవలసి వస్తోందని చెప్పారు. కన్నా చర్చ ప్రారంభిస్తారని, మాటలకు పదునుపెట్టడంతో పాటు, ప్రత్యర్థులపై రాజకీయంగా విరుచుకుపడే ఆయన ధాటికి బ్రేక్ వేయాలంటే గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ముందుండాలని, కానీ వారంతా పెళ్లిళ్ల పేరిట మాయమయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రులపై విలేకరుల సమావేశం నిర్వహించాలని సూచించినా, ఒక్కరూ నిర్వహించిన దిక్కులేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన పత్తిపాటి పుల్లారావు విఫమలయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వినుకొండ వెళ్లిన ఆయన అక్కడ కనీసం మీడియా వద్ద కూడా మంత్రులపై మాట్లాడకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ జిల్లాలో కొందరు ప్రముఖులు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులతో వ్యాపార, రాజకీయ సంబంధాలు నిర్వహిస్తున్నందుకే ఈ దుస్థితి ఏర్పడిందని, దాని ప్రభావం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించిందని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పొన్నూరు మునిసిపాలిటీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతుదారులయిన కాంట్రాక్టర్లను పక్కకుపెడితే, నరేంద్రను ఎక్కువ మాట్లాడకుండా దారికి తెచ్చెకోవచ్చని స్వయంగా జిల్లా పార్టీ ప్రముఖుడే మంత్రి మోపిదేవికి సలహా ఇచ్చారన్న వార్తలు తమ పార్టీలో అంతర్యుద్ధాన్ని సూచిస్తున్నాయంటున్నారు. లాబీలో ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకోమని సలహా ఇస్తున్నారని, అధికారులతో మాట్లాడి పోరాడే బదులు మంత్రులతో కార్యకర్తల ముందే ఫోన్లు చేస్తుంటే ఇక కార్యకర్తల్లో పోరాటతత్వం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వ్యాపారాలు, రాజకీయ సంబంధాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నా వారిపై బాబు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్ధితి నెలకొందని పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకయినా సిద్ధమేనని బాబు తరచూ చెప్పడమే తప్ప, ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంవల్లే క్రమశిక్షణారాహిత్యం పెరిగిందంటున్నారు.
కాగా, మద్యం ముడుపుల వ్యవహారంలో మంత్రి కన్నా మాట్లాడతారని ముందే తెలిసినా ఆ మేరకు సమర్ధులను ఎంపిక చేసుకోవడంలో తాము వైఫల్యం చెందామని టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్థుడే అయినప్పటికీ, ఈ అంశం రాజకీయాలతో ముడిపడినందున, పార్టీ మారి వచ్చిన గాలితో మాట్లాడించడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎకై్సజ్ మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వరరావునో, బాగా మాట్లాడగల పయ్యావుల కేశవ్ గానీ, కన్నా జిల్లా అయినందున ధూళిపాళ్లను గానీ, ప్రత్యర్ధులపై దూకుడుగా వెళ్లే రేవంత్రెడ్డితో గానీ మాట్లాడిస్తే బాగుండేదంటున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం ఆ జిల్లాకు చెందిన పత్తిపాటి పుల్లారావునయినా మాట్లాడించవలసిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, బాబు నేరుగా మంత్రులపై విమర్శలు చేయటం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం వరకూ చెప్పి, మంత్రులపై ఆరోపణలు చేసే బాధ్యతను మిగిలిన వారికి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ‘మా సార్ తన గురించి ఎక్కువ చెప్పుకోవడం మానుకోవాలన్నది మా అభిప్రాయం. ఆయన స్థాయిలో మంత్రులపై విమర్శలు చేయకూడదు. ఆ పనిని మాలాంటి వాళ్లకు అప్పగిస్తే సరిపోతుంది. అన్నీ తానే చూసుకోవాలన్న విధానం ఇంకా మానుకోలేకపోతున్నార’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తొలిరోజు సభలో పైచేయి సాధించిన తాము రెండోరోజు చేతులెత్తేయడానికి వ్యూహరచన లోపమేనని అంగీకరిస్తున్నారు.

No comments:
Post a Comment