Feb 1, 2012

ప్రాణ స్నేహితురాలు శశికి సంకెళ్ళు వేయించబోతున్నజయలలిత

(సూర్య వార్త)
 ప్రాణంలో ప్రాణంగా మెలిగిన స్నేహితులు కత్తులు దూసుకునే శత్రు వులుగా మారవచ్చనేందుకు జయలలిత-శశికళలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ‘సహచరి’ శశికళ స్నేహబంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాణ సఖి శశికళ వల్లే తనకు ముప్పు ఉందని భావిస్తున్న జయలలిత ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాతికేళ్ల పైబడిన స్నేహబంధం వారిది. జయలలిత అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ ఇద్దరూ అడుగులో అడుగేసి నడిచారు. జయలలితకు సర్వస్వం ఆమే...అన్న విధంగా శశికళ ఎదిగారు. ఒక్క శశి మాత్రమే కాదు.ఆమె భర్త నటరాజన్‌, ఇతర కుటుంబ సభ్యులు జయలలిత ఫ్యామిలీగానే గుర్తింపు పొందారు.

అయితే, కొంతకాలం క్రితం జయలలిత ఈ స్నేహబంధాన్ని హఠాత్తుగా తుంచేసు కున్నారు. ఇంటి నుంచి బయటికి గెంటేశారు. శశికళను, ఆమె భర్త నట రాజ న్‌ను, బంధువర్గం మొత్తాన్ని పార్టీ ననుంచి బహిష్కరించారు. జయ లలిత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది.
తను ప్రాణప్రదంగా చూసుకున్న శశికళ తనకే ఎసరు పెట్టబోతోందని జయ లలిత గ్రహించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తనను ఆ పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని జయలలిత గ్రహించారు. జయలలితపై ఉన్న కేసులు కనక రుజువైతే ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నటరాజన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కుట్ర పన్నారు. సరైన పథక రచనలేని ఈ కుట్రకు సూత్రధారి శశికళే అని తెహల్కా పత్రిక రాసింది.తనను సీఎం పదవి నుంచి కూలదోసి, శశికళ భర్త నటరాజన్‌ను ిసీఎం చేయడానికి పథకం సిద్ధం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జయలలితను హెచ్చరిం చారు. జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొన్ని నెలలకే మోడీ ఈ హెచ్చరిక చేశారు. చుట్టూ ఉన్నవారితో, ముఖ్యంగా శశికళ విషయంలో జాగ్రత్త గా ఉండమని హితవు చెప్పారు. 

jayalalitha0నరేంద్రమోడీ జయలలితకు ఈ హెచ్చరిక చేయడానికి వెనక కొంత కథ నడిచింది. జయలలితకు, మోడీకి ఎప్పటి నుంచో రాజకీయంగా మంచి సంబం దాలున్నాయి. కొంతకాలం కిందట గుజరాత్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త ఓ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమిళనాడు వెళ్లారు. అక్కడ ఏ పని జరగాలన్నా మన్నార్‌గుడి మాఫియా (ఎంఎం) అండలేందే జరగదని తెలిసింది. మన్నార్‌ గుడి మాఫియా అంటే ఎవరో కాదు, శశికళ అండ్‌ కో మొత్తం ప్రాజెక్ట్‌ విలు వలో తమకు 15 శాతం కమీషన్‌ ఇవ్వాలని శశికళ బృందం డిమాండ్‌ చేసింది. ఆ ఎన్‌ఆర్‌ఐ గుజరాత్‌ వెళ్లి నరేంద్రమోడీకి చెప్పారు. మోడీ వెంటనే ఈ సంగతి జయలలితకు చెప్పారు. మోడీ చెప్పడంతో జయలలితకు శశికళ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. చెనై్న మోనోరైల్‌ ప్రాజెక్టుపై సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సింగపూర్‌లో పరిశ్రమలున్న ఆ ఎన్‌ఆర్‌ఐకే ఈ ప్రాజెక్టు ఇద్దామని ిసీఎం భావించారు. రాతకోతలన్నీ పూర్త య్యాక తన వద్దకు వచ్చిన ఫైల్‌ను చూసి జయలలిత షాకయ్యారు. ఈ కాం ట్రాక్ట్‌కు మరో కంపెనీకి ఇవ్వాలంటూ మలేసియా ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టు ఆ ఫైల్‌ తయారై వచ్చింది. పైగా, ఆ కాంట్రాక్ట్‌ను మలేసియా కంపెనీకి ఇవ్వాలని తమిళనాడు సీఎం రాసినట్టు ఫైల్‌లో ఉంది. సంతకాలూ ఉన్నాయి. శశికళపై అనుమానం బలపడింది. ఫైల్‌పై సంతకాలు ఎవరివని శశికళను నిలదీశారు. శశికళ తనకు తెలీదని చెప్పారు. దీనితో ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం సన్నగి ల్లింది. శశికళపై అనేక భూకుంభకోణాల కేసులున్నాయి. ఆ కేసుల చిట్టా అంతా జయలలిత వద్ద ఉంది. మన్నార్‌గుడి మాఫియా గుట్టంతా జయలలిత తన చేత చిక్కించుకున్నారు. మోడీ సలహాతోనే జయలలిత జాగ్రత్త పడ్డారని తెలుస్తోం ది. శశి బయట ఉంటే తనకు ముప్పని గ్రహించి ముందు జాగ్రత్తగా, ఈ కేసు ల్ని చూపి జయలలిత శశికళను అరెస్ట్‌ చేయవచ్చని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment