Nov 30, 2011

సోనియమ్మ త్వరలోనే తెలంగాణా ఇస్తుంది:కెసిఆర్

ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
 ‘తెలంగాణలో ఏం జరుగుతున్నదనే విషయంపై సోనియాగాంధీ సొంతంగా విచారణ (ఎంక్వైరీ) చేయిస్తున్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే దొంగ నివేదికలపైనే ఆమె ఆధారపడడం లేదు. జిల్లాకు 60-70 మందిని పంపించి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు నాకు సమాచారం ఉంద’ని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ వ్యాఖ్యలిలా ఉన్నాయి. ‘కేవలం ప్రభుత్వం, గవర్నరు ఇచ్చే నివేదికలను సోనియాగాంధీ గుడ్డిగా నమ్మడం లేదు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారు ఇచ్చే నివేదికలు తెలంగాణలోని పరిస్థితికి పూర్తిభిన్నంగా ఉన్నాయని ఆమెకు కూడా అర్థమైంది. క్షేత్రస్థాయికి వెళితే సానుకూలంగానే నివేదికలు వస్తాయి.

త్వరలోనే సానుకూల నిర్ణయం రావచ్చు’నని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలిసిం ది. ‘కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు సలహాలు ఇస్తున్నరో ఏమో.. నిజంగా వారికి బుర్ర ఉంటే ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి చేసిన తీర్మానం అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ఏర్పాటుచేయాలి. ఈ నిర్ణయం తీసుకుంటే అక్కడ యూపీలోనూ, ఇక్కడ ఏపీలోనూ రాజకీయంగా లాభపడొచ్చు. పరిస్థితులన్నీ అను కూలంగాఉన్నాఎందుకు తాత్సారం చేస్తున్నరో..ఏమో..?’ అని వ్యాఖ్యానిం చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కాకుండా అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారని కేసీఆర్ అభిప్రాయ పడినట్లు సమాచారం. ‘అవిశ్వాస తీర్మానం నెగ్గి, ప్రభుత్వం పడిపోయే పరిస్థితులున్నాయి. ఈ సమయంలో జగన్ వైఖరి, ఆయన వెంటవచ్చే ఎమ్మెల్యేల బలమే కీలకం కానుంది. సంఖ్యాబలం ఎంత అనేది చాలా ముఖ్యం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

నేడు వరంగల్‌కు కేసీఆర్

హైదరాబాద్: నాసా చట్టం కింద అరెస్టయిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించడానికి పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం వరంగల్‌కు వెళ్లనున్నారు. చెరుకు సుధాకర్‌ను కలవడానికి జైలు అధికారుల నుంచి కేసీఆర్ ఇప్పటికే అనుమతి తీసుకున్నట్లుగా పార్టీవర్గాలు ప్రకటించాయి. గురువారం ఉదయమే వరంగల్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
Read more ...

రామ్ చరణ్ ఉపాసన ఫోటోలు













Read more ...

చిక్కుల్లో 'చేవెళ్ల చెల్లెమ్మ'


ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:


సబిత చెబితేనే..
కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి
బెయిల్ పిటిషన్‌లో సంచలన వివరాలు

మంత్రి ఆమోదించాకే జీవోల జారీ
రేపో మాపో ఓఎంసీ కేసులో చార్జిషీటు
మంత్రి ప్రస్తావన తేవడం అనివార్యం?
నేను రాక ముందే ఓంఎసీకి లీజులు
రాజగోపాల్ ఇచ్చిన జాబితానే కేంద్రానికి..
తవ్వకాలు, పర్మిట్లు, రవాణాతో సంబంధం లేదు
జీవో, ముసాయిదాపై నా సంతకాలు లేవు
పిటిషన్‌లో శ్రీలక్ష్మి స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 30 : 'నేను చేసింది తప్పయితే... ఆ తప్పును మంత్రి సబితా ఇంద్రారెడ్డే చేయించారు. ఆమె ఆమోదంతోనే అంతా జరిగింది'... అక్రమ గనుల కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సారాంశమిది!

దీంతో 'అన్న' కాలంలో జరిగిన అక్రమాల తంతు 'చేవెళ్ల చెల్లెమ్మ'ను మరింత బలంగా చుట్టుముడుతోంది. శ్రీలక్ష్మి రిమాండ్ డైరీలో సీబీఐ మంత్రి ప్రస్తావన తీసుకురావడమే సంచలనం సృష్టించింది. బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో శ్రీలక్ష్మి మరిన్ని సంచలనాత్మక సంగతులు బయటపెట్టారు. 'ఏదైనా తప్పు జరిగిందంటే అందుకు బాధ్యత నాది కాదు. పైస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కింది స్థాయిలో ఉన్న నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌లదే ఈ పాపం. నేను నిమిత్తమాత్రురాలిని' అని శ్రీలక్ష్మి చెప్పకనే చెప్పారు.

వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ... హోదాలతోనే మొత్తం వివరాలు వెల్లడించారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు.

ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ' నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.

వెరసి... 'నేరం నాది కాదు! సబితది' అని పరోక్షంగా నాటి గనుల మంత్రి, నేటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని... వైఎస్ సర్కారును వేలెత్తి చూపించారు. 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాలను నేను తొలగించానన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. "ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు, ఖనిజ రవాణా, ఎగుమతి, పర్మిట్లు వీటిలో దేనితోనూ నాకు సంబంధంలేదు'' అని చెప్పారు. ఇది బెయిల్ పిటిషన్ అయిప్పటికీ... కాస్త అటూ ఇటుగా శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు. అదికూడా... ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు ముందు, లిఖితపూర్వకంగా సంచలనాత్మక విషయాలు విప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో 'ఎవరి ఆదేశాల మేరకు' గాలి గనుల ఫైళ్లను అంత వేగంగా ఆమోదించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కూడా సబితపై పడింది.

ఓఎంసీ కేసులో మరో రెండు రోజుల్లో చార్జిషీటు సమర్పించనున్న నేపథ్యంలో... శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న వివరాలు కీలకంగా మారాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... అభియోగ పత్రంలో సబిత ప్రస్తావనతోపాటు, ఓఎంసీకి గనుల కేటాయింపులో ఆమె పాత్ర గురించి వివరించడం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే... సబిత 'గనుల ఊబి'లో కూరుకుపోయినట్లే. ఈ కేసులో సీబీఐ సుమారు పదివేల పేజీలతో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేయనుంది. ఈ కేసులో మరికొందరు అధికారుల ను సహ నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది.
Read more ...

తమిళంలో రానా!

హీరో రానా తమిళదేశానికి వెళుతున్నారు! అక్కడ శింబు కథానాయకుడిగా జాతీయ అవార్డ్‌ గ్రహీత వేట్రిమారన్‌ (ఆడుకళం ఫేం) దర్శకత్వం వహించే సినిమాలో అతిధిగా నటించనున్నారు. ‘వడ చెనై్న’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆండ్రియా జెరోమి ఓ కథానాయిక. జి.వి. ప్రకాష్‌ సంగీతదర్శకత్వం వహిస్తున్నారు. దయానిధి అలగిరి నిర్మిస్తున్నారు. మార్చి 2012లో ఈ సినిమా సెట్స్‌కెళ్లనుంది. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంతో రానా తమిళారంగేట్రం చేస్తారని అప్పట్లో వార్తలొచ్చినా..ఆ సినిమా సెట్స్‌కెళ్లే పరిస్థితి లేదని తెలిసింది. 

(సూర్య వార్త)

Read more ...

సంక్రాంతికి ‘పూలరంగడు'

సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్, మేక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై విరభద్రం దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పూలరంగడు’. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘చిత్రం నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేశాం. ప్రస్తుతం క్లైమాక్స్ దృశ్యాలు భారీఎత్తున షూటింగ్ చేస్తున్నాం. సునీల్ సరికొత్త యాంగిల్‌లో ‘పూలరంగడు’ చిత్రంలో కనిపిస్తాడు. ఆయన కెరీర్‌లో అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాం. మా సంస్థనుండి మరొక సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ’ని తెలిపారు. కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వీ, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్విసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీ్ధర్ సీపన, ఎడిటింగ్: గౌతంరాజ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరేళ్ల, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.

(ఆంధ్రభూమి వార్త)

Read more ...

రెండు పడవల ప్రయాణమే సుఖం: సబ్బం హరి


ఈ రోజు ఆంధ్రభూమి దిన పత్రికలో వచ్చిన వార్త ఇది:
వచ్చే ఎన్నికలలోవైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ప్రకటించారు. అయితే ఎన్నికలు జరిగే లోపుకడప ఎంపీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయవలసిందిగా ఆదేశించిన మరునిమిషం పదవికి రాజీనామా చేస్తానని ఆయన బుధవారం స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు ఆయన చెప్పారు.



పార్టీలోఉన్నంత కాలం పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను. పార్లమెంటులో ఓటు వేయవలసిన అవసరం వస్తే కాంగ్రెస్‌కే వేస్తాను. అయితే అంతరాత్మ ప్రభోదానికి వ్యతిరేకంగా ఓటు వేయవలసి వచ్చినా లేక నచ్చని పక్షంలో రాజీనామా చేయటానికి వెనుకాడనని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీలో ఉన్నందునే బుధవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరైనట్లు సబ్బం అన్నారు. జగన్ సూచన మేరకే తాను కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగుతున్నానని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో సమస్యలు, అభిప్రాయ బేధాలు తలెత్తటం సహజమని చెబుతూ తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా కుటుంబపెద్దగా వ్యవహరిస్తున్న పార్టీ అధ్యక్షురాలికి తెలియచేయటానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కులు చింపిన విస్తరైపోతుందని జగన్ చెప్పిన మాటలు నూటికి నూరుశాతం నిజమవుతున్నాయని హరి అన్నారు. జగన్ మద్దతు దారులు తమ శాసనసభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించే విషయమై స్పీకర్ ద్వంద్వనీతితో వ్యవహరిస్తున్నారని ఎంపీ విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ శాసన సభ్యుల విషయమై తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రతి పరిణామాన్ని లోతుగా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు.
Read more ...

నిశ్చితార్థానికి మెగా పాసులు!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌- ఉపాసన కామినేని నిశ్చితార్థం నేడు వేదమంత్రాల సాక్షిగా రాత్రి 7.30 నిమిషాలకు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ రోడ్‌ లోని ఉపాసన కుటుంబీకులకు చెందిన ఫాం హౌజ్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడకకు పకడ్బందీగా మూడంచెల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం సన్నిహితులు, చిరు ఆహ్వానం అందుకున్న వీవీఐపీలకు మాత్రమే ఇందులో ఎంట్రీ ఉంటుంది. మామూలు పాసులు అయితే వెరైటీ ఏముంది? అనుకున్నారో ఏమో....తమ రేంజ్‌కి తగిన విధంగా ఎలక్ట్రానిక్‌ ఎంట్రీ పాసులను తయారు చేయించారు మెగా-కామినేని కుటుంబ సభ్యులు. ఏటిఎం కార్డుల మాదిరి ఉన్న ఈ ఎంట్రీ పాస్‌ స్వైప్‌ చేయగానే ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో ఎంట్రీ అవ్వడానికి గేట్లు తెరుచుకుంటాయి. 
Read more ...

రెడ్డిల్యాబ్స్‌కు సీబీఐ నోటీసులు జారీ

చంద్రబాబు ఆస్తుల కేసులో రెడ్డి ల్యాబ్స్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ట్యాక్స్‌ డిఫరెంట్‌ కింద రెడ్డిల్యాబ్స్‌కు రూ. 25 కోట్లను చంద్రబాబు లాభం చేకూర్చారని ఆరోపణపై రెడ్డిల్యాబ్స్‌కు కేటాయించిన స్థలం వివరాలను సీబీఐ కోరింది. 

(ఆంధ్రభూమి వార్త)

Read more ...

80 పైసలు తగ్గిన పెట్రోలు

 పెట్రోలు ధరలు లీటరుకు 78 పైసల మేర తగ్గాయి. ఈ తగ్గుదల బుధవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు ధరలు తగ్గడం ఈ నెలలో ఇది రెండో సారి. ఇంతకు ముందు ఈ నెల 16న చమురు కంపెనీలు పెట్రోలు ధరలను లీటరుకు రూపాయి 82 పైసల మేర తగ్గించిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల్లో డాలరుతో రూపాయి విలువ మరికాస్త తగ్గడంతో ఊహించిన దానికన్నా తక్కువగానే ధర తగ్గింది. ఈ తగ్గింపుతో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు 66 రూపాయల 42 పైసలున్న పెట్రోలు ధర 65.64 పైసలు అవుతుంది. స్థానిక పన్నుల్లో తేడాల కారణంగా మిగతా నగరాల్లో తగ్గుదలలో స్వల్ప తేడాలుండవచ్చు.

(ఆంధ్రభూమి వార్త)

Read more ...

విశాఖకు చేరుకున్న భారత్‌ - వెస్టిండీస్‌ జట్లు

నేడు నెట్‌ప్రాక్టీస్‌ చేయనున్న ఇరుజట్లు
-రేపు విశాఖ వేదికగా రెండో వన్డే
- విశాఖ వన్డేలలో వరుసగా విజయాలు సాధిస్తున్న భారత్‌ జట్టు 

భారత్‌- వెస్ట్‌ ఇండీస్‌ వన్డే సీరీస్‌లో భాగంగా రెండో ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరుజట్లు బుధవారం విశాఖ చేరుకున్నాయి. వన్డే సీరీస్‌లో భాగంగా మంగళవారం కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ జట్టుతో పాటు వెస్ట్‌ ఇండీస్‌ జట్టులోని క్రీడాకారులందరూ ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. పూర్తి భద్రత నడుమ ఇరుజట్ల సభ్యులను నగరంలోని గ్రాండ్‌బే హోటల్‌కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాల్వో బస్సుల్లో తరలించారు. విశాఖ విమానాశ్రయంలో ఇండియా జట్టు కెప్టెన్‌ సెహ్వాగ్‌తో పాటు గౌతం గంభీర్‌, వెస్ట్‌ విండీస్‌ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. ఇరు జట్ల సభ్యులు బుధవారం హోటల్‌కే పరిమితమై విశ్రాంతి తీసుకుంటాయని క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వాహకులు తెలిపారు. అయితే ఇరుజట్లు వేర్వేరుగా నగర శివారు పోతిన మల్లయ్యపాలెంలోని వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎసిఎ- విడి సిఎ క్రికెట్‌ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌ చేయనున్నారు. 

భారత్‌కు అచ్చొచ్చిన విశాఖ పిచ్‌

భారత్‌ జట్టుకు విశాఖ పిచ్‌ అచ్చొచ్చినట్లేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో భారత్‌ విజయ దుందుభి మోగించగా, శుక్రవారం జరిగే డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో సైతం ఇదే జోరును కొనసాగించి సీరీస్‌ ఆధిక్యత సాధించడం ఖాయమని నగరంలోని క్రికెట్‌ అభిమానులు ధీమాగా వున్నారు. అయితే మొదటి మ్యాచ్‌లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ చతికిలపడినా, పేసర్లు భారత్‌ జట్టును గెలిపించిన తీరు ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌లు విఫలం చెందిన నేపథ్యంలో అపజయాలనే మూటకట్టుకున్న భారత్‌ జట్టు కటక్‌లో మాత్రం క్రికెట్‌ విమర్శకుల నోటికి తాళం వేయించే విధంగా తుదకంటూ పోరాటం సలిపి విజయాన్ని సాధించిన తీరు క్రికెట్‌ అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు విశాఖనగరంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎసిఎ -విడిసిఎ స్టేడియం రికార్డును పరికిస్తే 2005 భారత్‌ - పాకిస్తాన్‌ జట్టుతో తలపడగా, రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌ జట్టు విజయం సాధించింది. 2007లో భారత్‌ - శ్రీలంకల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో సైతం భారత్‌ అదే స్పీడ్‌ను కొనసాగించి విజయం సాధించింది. 2010లో భారత్‌ - ఆస్ట్రేలియాతో తలపడగా టార్గెట్‌ ఛేదించి మరీ భారత్‌ విజయం సాధించింది. అదే విధంగా 2011లో జరగనున్న ఈ మ్యాచ్‌లో సైతం అదే స్పీడ్‌ను కొనసాగిస్తుందనే ధీమాను క్రికెట్‌ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
(సూర్య వార్త)
Read more ...

Nov 29, 2011

దేశమంతా పాకిన ‘వెర్రి’పాట

(సాక్షి వార్త)

‘పిచ్చి’ పలు రకాలు.. ‘వెర్రి’ వెయ్యి రకాలు అంటారు. ప్రస్తుతం తమిళనాట ఎక్కడపడితే అక్కడ వినిపిస్తున్న ఓ వెర్రి పాటకు ఈ సామెత అక్షరాలా సరిపోతుంది. కుర్రకారు వెర్రెత్తిపోయి ఈ పాటను వింటారు. ఆ మాటకొస్తే యువకులను మాత్రమే కాదు.. వయసు మీద పడినవారికి కూడా ఈ వెర్రి అంటుకుంది. జనాలను ఈ స్థాయిలో వెర్రెక్కించేలా చేసిన ఆ పాట ‘కొలవెరి.. కొలవెరి.. కొలవెరి... కొలవెరి డి...’ అని సాగుతుంది. ‘కొలవెరి..’ అంటే ‘చంపాలనేంత వెర్రి..’ అనమాట.

తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన ‘3’ సినిమాకి సంబంధించిన పాట ఇది. కొత్త సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర సంగీతం సమకూర్చిన ఈ పాటను స్వయంగా ధనుష్ రాసి, పాడారు. తప్పుల తడకలతో ఉన్న ఇంగ్లిష్ లిరిక్స్‌తో సాగే ఈ పాటలో తప్పులు వెతకడం మొదలుపెడితే... చాలా కనిపిస్తాయి. కానీ ఆ తప్పులను ఒప్పుగా చేసుకుని మరీ ఈ పాట వింటున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ పాట వెర్రెత్తించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ లిరిక్ గురించి కొంచెం చెప్పుకుంటే... ‘కొలవెరి.. కొలవెరిడి.. మూను కలరూ వైటూ.. వైటూ.. బ్యాక్‌గ్రౌండూ నైటూ నైటూ.. వైటు స్కిన్ను గర్ల్ గర్ల్.. గర్లు హార్టూ బ్లాకూ.. లవ్వూ.. లవ్వూ.. ఓ మై లవ్వూ...’ ఇలా ఏమాత్రం గ్రామర్ పాటించకుండా ధనుష్ ఈ పాట రాశారు. 

కానీ ఈ గ్రామర్ లేని పాట అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సాహిత్య విలువులు లేకపోయినా ట్యూన్ క్యాచీగా ఉండటంతో ఈ పాట హిట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో ఏ పాటా ఈ రేంజ్‌లో హిట్ కాలేదు. ఇప్పుడు తమిళనాడులో ఈ ‘కొలవెరి’ ఫీవర్ పట్టుకుంది. ఈ పాటకు స్వరం సమకూర్చిన అనిరుధ్‌కి ఊపిరి సలపలేని విధంగా అవకాశాలు వస్తున్నాయి. దక్షిణాదిన మాత్రమే కాకుండా ఉత్తరాదిన కూడా ఈ పాట హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా దక్షిణాది దర్శక, నిర్మాతలు మాత్రమే కాదు.. ఉత్తరాదివారు కూడా అనిరుధ్‌కి సినిమాలు ఆఫర్ చేస్తున్నారట. 

ఒక్క పాట జీవితాన్ని ఈ విధంగా మార్చేస్తుందని అనిరుధ్ ఊహించి ఉండరు. ధనుష్ అయితే.. ఈ పాట ఓ నాన్సెన్స్ అంటున్నారు. శ్రోతలు సింపుల్ లిరిక్స్ కోరుకుంటున్నారని దీన్నిబట్టి అర్థం అయ్యిందని, అసలీ పాట ఇంత హిట్ అవుతుందని ఊహించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. చివరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఈ పాటను మెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తన అల్లుడు పాడిన ఈ పాట బాగుందని అభినందించారట. ఐశ్వర్యధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచింది. వెర్రికి పరాకాష్ట ఇదేనేమో..?
Read more ...

సినీ రచయిత రాజా కుమారుడు అరెస్ట్


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

 సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ యువతులను మోసం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సినీ రచయిత మరుదూరి రాజా కుమారుడు సాయి కిషోర్ సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read more ...

Nov 28, 2011

పవన్‌ పొలిటికల్‌ డ్రామా!?


ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
బద్రి’ కాంబినేషన్‌ రిపీటవుతున్న సంగతి తెలిసిందే. పవన్‌- పూరి..ఈసారి పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాతో తెరపైకి రానున్నారని సమాచారం. జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆంధ్రానేత నిజజీవిత కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో సీనియర్‌ రచయిత కోన వెంకట్‌ తలమునకలుగా ఉన్నారని.. విశ్వసనీయంగా తెలుస్తోంది.puri-jagannathమాఫియా, రొమాన్స్‌ జానర్‌ కథాంశాలతో హిట్లు సాధించిన పూరి జగన్నాథ్‌..ఈ సారి అసలు సిసలు పొలిటికల్‌ డ్రామా (బండ్ల గణేష్‌ నిర్మాత) ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోందని ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ‘పంజా’ కోసం ఎదురుచూస్తున్న మెగాభిమానులకు ఇదో డబుల్‌ బొనాంజ అని భావించొచ్చు. 
Read more ...

1న టీడీపీ అవిశ్వాస నోటీసు!


(సాక్షి వార్త)

రైతాంగ సమస్యల పరిష్కారంలో విఫలమైం దంటూ ప్రభుత్వంపై టీడీపీ గురువారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించనుంది. ఇదే విషయాన్ని మం గళ లేదా బుధవారాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తెలియజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ సోమవారం విలేకరులతో చెప్పారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా చూడాల్సిందిగా స్పీకర్‌ను కోరతామన్నారు.

Read more ...

మగదీరునికి నిశ్చయ తాంబూలాలు త్వరలో

(ఈనాడు నుండి) 
Read more ...

సిబిఐ దర్యాప్తు పై చంద్రబాబు ఆక్రోశం

నా జీవితం తెరచిన పుస్తకం,
ఇటువంటిది ఎక్కడైనా ఉందా ?
చంద్రబాబు ఆవేదన
నా జీవితం తెరచిన పుస్తకం అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా చేసిన వ్యక్తిపై అర్థంలేని ఆరోపణలు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ ట్రస్టు పేర ఎంతో పారదర్శకంగా ఎన్నో మంచి పనులు చేస్తుంటే ఇలా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టుపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అర్థం లేనివని ఆయన అన్నారు. రైతు శ్రేయస్సుకోసం, వారి అభివృద్ధికోసం తాను పోరాడుతుంటే ప్రభుత్వం ఇబ్బందిపెట్టాలని చూస్తున్నదని ఆయన అన్నారు. రైతును ఆదుకోవాలని, అవినీతిని పారద్రోలాలని తాను పోరాడుతున్నానని ఆయన చెప్పారు. ఈ ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకి అని కిరణ్‌కుమార్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందుకే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అక్కరలేదు అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము దూరదృష్టితో ఈ సేవ ప్రారంభిస్తే, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ అంటోందని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
(ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది)
Read more ...

పవన్ కళ్యాణ్ పంజా సినిమా వర్కింగ్ స్టిల్స్











Read more ...

ఈ రాత్రికి కూడా జైలులోనే కనిమొళి!:


(సాక్షి వార్త)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆమె ఈ రాత్రి కూడా జైలులో ఉండక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. 2జి స్పెక్ట్రమ్ కేసులో 5 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఈరోజు ఆమెకి బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిలు మంజూరైనప్పటికీ సంబంధిత పత్రాలు సమయానికి సమర్పించనందున ఆమె ఈరోజు విడుదల కాలేదు. ఈ రాత్రికి ఆమె జైలులోనే ఉంటారు.
Read more ...

263 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్


(సాక్షి వార్త)
ఎపిపిఎస్ సి 263 పోస్టులతో గ్రూప్-1 నోటిషికేషన్ విడుదల చేసింది. 19 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. 2012 అక్టోబరు 3 నుంచి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
Read more ...

కనిమొళికి బెయిల్ మంజూరు


(సాక్షి వార్త)
 2జి స్పెక్ట్రమ్ కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి ఢిల్లీ హైకోర్టు 5 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో ఆమెతోపాటు కళైంజర్ టివి ఎండి శరత్ కుమార్, ఆసిఫ్ బల్వా, మరో ఇద్దరికి కూడా బెయిలు మంజూరైంది. మే20న కనిమొళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు.

టెలికం మాజీ సెక్రటరీ బెహూరాకి బెయిలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
Read more ...

ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ అరెస్ట్


(సాక్షి వార్త)


ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) కేసులో ఐఎఎస్ అధికారి, వైద్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీలక్ష్మీని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెని సిబిఐ అధికారులు ఇటీవల రెండు రోజులు విచారించిన విషయం తెలిసిందే. గతంలో ఆమె గనుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో గనుల కేటాయింపులలో అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆమెని సిబిఐ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలిస్తారు.
Read more ...

సర్కారుతో కాళ్ల బేరానికి వచ్చిన ఎమ్మార్ సంస్థ

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

ఎంజీఎఫ్‌తో తెగదెంపులు చేసుకుంటాం
2002 ఒప్పందం ప్రకారం నడుచుకుంటాం
ప్రభుత్వానికి లేఖ రాసిన ఎమ్మార్ చైర్మన్ అలబార్

సీబీఐ విచారణ దెబ్బకు దుబాయ్ 'షేకు' గజగజ
ప్రాజెక్టు కొనసాగిస్తామంటూ రాయబారం
26 శాతం వాటాపై ఇంతకు ముందూ ఉత్తరాలు
విల్లాలు అమ్మేసుకొని ఒప్పందం అమలంటే ఎలా?
హైకోర్టు విచారణ, సీబీఐ దర్యాప్తు సంగతేంటి?
పరిశ్రమల శాఖ అధికారుల విస్మయం
పాపాలన్నీ చేసేసి.. గంగలో మునిగితే ప్రాయశ్చిత్తం అయిపోతుందా? చేయాల్సిందంతా చేసేసి.. పొరపాటైంది క్షమించండి అని ప్రాధేయపడితే తప్పులన్నీ ఒప్పులై పోతాయా? చట్ట ఉల్లంఘనలకు పాల్పడి.. లెంపలేసుకొంటే.. శిక్ష నుంచి తప్పించుకోవచ్చా? ఎమ్మార్ ప్రాపర్టీస్ యాజమాన్యం మాత్రం అవుననే భావిస్తోంది మరి.

అదెలాగంటే.. ఎమ్మార్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ దెబ్బకు ఆ సంస్థ యాజమాన్యం దిమ్మతిరిగింది. సర్కారుతో కాళ్లబేరానికి వచ్చింది. ఏపీఐఐసీతో 2002లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును కొనసాగిస్తామని ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు లేఖ రాశారు.



హైదరాబాద్, నవంబర్ 27 : ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు దిమ్మతిరిగింది. రాష్ట్రంలోని ఎమ్మార్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ... సర్కారు చర్యలతో దుబాయ్ షేకులు 'షేక్' అయ్యారు. సర్కారుతో కాళ్ళ బేరానికి వచ్చారు. ఎమ్మార్‌హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్టు లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)కు ఢిల్లీకి చెందిన ఎంజీఎఫ్‌తో కుదిరిన అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ షేకులు బేషరతుగా ప్రకటించారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో 2002 నవంబర్ 6న ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్‌సీ దుబాయ్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.

ఈ మేరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబార్.. మన రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతి పరిశ్రమల శాఖకు కూడా చేరిందని విశ్వసనీయ వర్గాలు «ద్రువీకరించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో.. పాత ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని సర్కారుకు ఎమ్మార్ ప్రాపర్టీస్ లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. "అయితే.. ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. సీబీఐ విచారణ జోరుగా సాగుతోంది. ఈ దశలో ఎమ్మార్ లేఖపై ప్రభుత్వం స్పందించే అవకాశంలేదు'' అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

పిల్లిమొగ్గలు ఇదే మొదటిసారి కాదు
ఈ ప్రాజెక్టు విషయంలో ఎమ్మార్ పిల్లిమొగ్గలు వేయటం ఇదే మొదటిసారి కాదు. ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత ఈహెచ్‌టీపీఎల్ ప్రాజెక్టులో ఏపీఐఐసీకి ఉన్న 26 శాతం వాటాకుగాను అభివృద్ధి చేసిన భూమిలో 26 శాతం వెనక్కి ఇస్తామని ఎమ్మార్ రాయబారాలు నడిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఒకవైపు చర్చలు సాగుతుండగానే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును సీబీఐ చేపట్టిన ఫలితంగా ఈ ప్రతిపాదన బుట్టదాఖలైం ది. దాంతో కలవరపాటుకు గురైన ఎమ్మార్ ప్రాపర్టీస్ యాజమాన్యం ఇప్పుడు మరో మెట్టు దిగింది.

ఎంజీఎఫ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని.. ఏపీఐఐసీతో 2002లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని ఇప్పుడు చెబుతోంది. మొత్తానికి పాత పాపాలను కప్పిపుచ్చుకునేందుకే ఎమ్మార్ ప్రాపర్టీస్.. ఇలా ప్రభుత్వంతో కాళ్ల బేరానికి వస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. "ఎంజీఎఫ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎమ్మార్ ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రకటిస్తే... ఇప్పటి వరకూ చేసిన పాపాలన్నీ కనుమరుగైపోతాయా? శిక్ష పడకుండా పోతుందా?'' అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

వైఎస్ హయాంలోనే అసలు గోల్‌మాల్
నిజానికి.. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్‌లతో కూడిన సమగ్ర ప్రాజెక్టు అమలుకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు 535 ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు 2002 జనవరి 6న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో ఈ ప్రాజెక్టును సమీక్షించారు. దాంతో.. 2005 ఏప్రిల్ 19న అనుబంధ ఒప్పందం జరిగింది.

తర్వాతే అసలు గోల్‌మాల్ మొదలైంది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్‌లోకి ఎంజీఎఫ్ రంగ ప్రవేశం చేసింది. ఏపీఐఐసీ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఈహెచ్‌టీపీఎల్ వ్యవహరించినా అప్పటి ఏపీఐఐసీ ఎండీ, ఈహెచ్‌టీపీఎల్ బోర్డు సభ్యుడిగా ఉన్న బి.పి.ఆచార్య ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇదంతా ప్రభుత్వ పెద్దల అండతో సాగిన దందా కావటంతో ఆనాడు అందరూ మౌనంగా ఉండిపోయారు.

అక్రమాలే లేకపోతే.. తప్పులు దిద్దుకుంటామని లేఖ ఎందుకో?
కాగా.. తాను ఎండీగా ఉన్న సమయంలో ఈహెచ్‌టీపీఎల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని... ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో ఏపీఐఐసీకి 26 శాతం వాటా ఉందని ఆచార్య వాదిస్తున్నారు. పోనీ ఆచార్య చెప్పినట్లు ఎలాంటి అవకతవకలు జరగకపోయి ఉంటే.. ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్‌సీ దుబాయ్ చైర్మన్ అలబార్ ఎంజీఎఫ్‌తో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని సర్కారుకు తాజాగా ఎందుకు లేఖ రాశారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

అలబార్ లేఖతో ఏపీఐఐసీ-ఎమ్మార్ ప్రాపర్టీస్ మధ్య ఒప్పంద ఉల్లంఘన జరిగిందనే విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ సంస్థ ప్రయోజనాలు కాపాడాల్సిన కొంతమంది అధికారులు ఇంకా ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఎలాంటి అక్రమా లు జరగలేదని వాదిస్తుంటే.. ఒప్పందం చేసుకున్న భాగస్వామ్య సంస్థ మాత్రం తమ తప్పులను దిద్దుకుంటామని సర్కారుకు లేఖ రాయటం విశేషం.

ఎమ్మార్-ఎంజీఎఫ్‌గా మారిందిలా!
ఎమ్మార్ ప్రాపర్టీస్-ఎంజీఎఫ్‌ల మధ్య 2006 నవంబర్ 3న అభివృద్ధి ఒప్పందం జరిగింది. దీంతో ఎమ్మార్‌హిల్స్ టౌన్ షిప్ ప్రాజెక్టు లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)కు చెందిన 258 ఎకరాల.. వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమి కొత్తగా అవతరించిన ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ పరమైంది. తర్వాత 2007 జూలై 25న అభివృద్ధి ఒప్పందంతో పాటు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ మరో ఒప్పందం చేసుకున్నారు. ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్ సీ, దుబాయ్ సంస్థ ఈహెచ్‌టీపీఎల్‌కు చెందిన 258 ఎకరాలను ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు బదిలీ చేయటంతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్ బాధ్యతలు అప్పగించింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో ఏపీఐఐసీకి కుదిరిన అనుబంధ ఒప్పందంలోని క్లాజు 8 ప్రకారం ఈహెచ్‌టీపీఎల్ హౌసింగ్ ప్రాజెక్టును అంతర్గతంగా సమకూర్చుకున్న వనరుల ద్వారా చేపట్టాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈహెచ్‌టీపీఎల్ ప్రాజెక్టులోకి ఎంజీఎఫ్ ఎప్పుడైతే భాగస్వామిగా చేరిందో అప్పుడే ఈ ప్రాజెక్టుకు 258 ఎకరాల భూమి సమకూర్చిన ఏపీఐఐసీ వాటాకు పూర్తిగా గండిపడింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ ఈ ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల రూపాయలు సంపాదించినా... ఏపీఐఐసీకి మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కలేదు.
Read more ...

హజారే దీక్షకు అనుమతి


(సాక్షి వార్త)


ప్రభుత్వం ఒకవేళ పటిష్ట లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే సామాజికవేత్త అన్నా హజారే డిసెంబర్ 27 నుంచి రామ్‌లీలా మైదానంలో చేపట్టే దీక్షకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని అన్నా బృంద వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సుమారు 30 వేల మంది సామర్థ్యంగల ఈ మైదానంలో డిసెంబర్ 27 నుంచి జనవరి 5 వరకూ దీక్ష చేపట్టేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరినట్లు తెలిపాయి. అయితే ఢిల్లీ పోలీసులు నిరభ్యంతర పత్రం ఇస్తేనే దీక్ష చేపట్టడం సాధ్యమవుతుందన్నాయి. హజారే నిరాహార దీక్ష చేపడతారా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నిరసన తెలిపే విధానాన్ని త్వరలో ఖరారు చేస్తామని చెప్పాయి.
Read more ...

బాబు అవినీతి మూలాలపై సీబీ‘ఐ’


(సాక్షి వార్త)
విజయమ్మ పేర్కొన్న ఆధారాలపై లోతుగా అధ్యయనం
ఆదివారం కూడా విధులకు హాజరైన జేడీ, ఇతర అధికారులు
ప్రశ్నావళికి రూపకల్పన.. నేడు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్‌లకు నోటీసులు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో... సీబీఐ అధికారులు ఆయన అవినీతి మూలాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో లెక్కకుమిక్కిలిగా పెరిగిన ఆస్తులపై దర్యాప్తు జరపాలని భావిస్తున్నారు. భూకేటాయింపులు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధిపొందారనే ఆరోపణల నేపథ్యంలో.. తొమ్మిదేళ్లలో చంద్రబాబు చేసిన కేటాయింపులు.. కూడబెట్టిన అక్రమ ఆస్తుల బండారాన్ని బట్టబయలు చేస్తూ వైఎస్ విజయమ్మ సమర్పించిన దాదాపు 2 వేల పైచిలుకు డాక్యుమెంట్ల రూపంలోని ఆధారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణతోపాటు ఇతర అధికారులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు ప్రతివాదులుగా ఉన్న 12 మంది నుంచి ఏం సమాచారం కోరాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ మేరకు ప్రశ్నావళిని సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన డాక్యుమెంట్లతో హాజరుకావాల్సిందిగా మొదటి దఫాగా బాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్‌లకు సోమవారం నోటీసులు జారీ చేయనున్నారు.

కుప్పలుతెప్పలుగా పెరిగిన ఆస్తులపై ఆరా!

1986లో తన కుటుంబం మొత్తానికి 70 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లో కుటుంబం విడిపోయాక తన వంతుగా వచ్చిన సొమ్ముతో నెల్లూరు జిల్లా బాలాయపల్లిలోని నిండాలిలో భూములు కొన్నట్లు.. 1988లో కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఆ భూముల ద్వారా తనకు ఏడాదికి రూ.36,000 ఆదాయం వచ్చేదని, తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ హైబ్రిడ్ వేరుశనగ పండించేవాడినని తెలిపారు. కానీ చంద్రబాబు 1978లో మంత్రి పదవి చేపట్టిన నాటినుంచే అక్రమ మార్గాల్లో ఆస్తిని పెంచుకుంటూ పోయారు.

సొంత తండ్రికే తన భూమిని తనఖా పెట్టడం, విక్రయించటం వంటి లావాదేవీలు నడిపారు. 1983లో టీడీపీలో చేరుతూనే తిరుపతిలో త్రీస్టార్ హోటల్ నిర్మించారు. తర్వాత దాన్ని టీడీపీకి చెందిన మరో నేతకు విక్రయించారు. కాగా నిండాలి, వాక్యం గ్రామాల్లో తన బంధువుల నుంచి అతితక్కువ రేటుకు అంటే ఎకరా రూ.1,000 చొప్పున 1985లో తొలుత 65 ఎకరాలు కొనుగోలు చేసిన చంద్రబాబు... ఆ తరవాత బినామీ పేర్లతో మరో 250 ఎకరాలు కొన్నారు. ఈ మొత్తం భూముల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని, నాలుగు పెద్ద చెరువుల్ని ఆక్రమించి మరీ తోట నిర్వహిస్తుండటాన్ని విజయమ్మ ఆధారాలతో సహా వివరించారు. అప్పట్లో తెహల్కా డాట్ కామ్ ఈ భూముల లోగుట్టును బయటపెట్టడంతో కారుచౌక ధరలకు తన బంధువులకు వీటిని విక్రయించినట్లుగా చూపించి... ఇప్పటికీ తన బినామీ తోటగా దాన్ని కొనసాగిస్తున్న వైనాన్నీ.. విజయమ్మ తెలిపారు. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెరిగిన తీరుపై చంద్రబాబును వివరణ కోరాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఈ కేసుపై దర్యాప్తు జరపాలని డీజీపీని సైతం కోర్టు ఆదేశించడంతో ఈమేరకు సీఐడీ కూడా కసరత్తు చేస్తోంది. సీబీఐ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ జరపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం.

విశాఖ నుంచి ప్రత్యేక బృందం

బాబు అక్రమాస్తుల కేసు దర్యాప్తునకు విశాఖపట్నం నుంచి ఐదుగురు అధికారులతో కూడిన బృందం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. విజయమ్మ సమర్పించిన ఆధారాల అధ్యయనం బాధ్యతను జేడీ వీరికి అప్పగించినట్లు తెలుస్తోంది. 
Read more ...

సిబిఐ విచారణ ఆపాలని బాబు పిటిషన్


(సాక్షి వార్త)
తన ఆస్తులపై సిబిఐ విచారణ నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Read more ...

వాళ్లు వెయ్యి రౌండ్లు కాల్చాకే ఎన్‌కౌంటర్ చేశాం:మమతా బెనర్జీ


(ఆంధ్రజ్యోతి వార్త)


మూడు రోజులు గడువిచ్చాం!
చుట్టముట్టి లొంగిపొమ్మన్నాం
వాళ్లు వెయ్యి రౌండ్లు కాల్చాకే ఎన్‌కౌంటర్ చేశాం
కిషన్‌జీ మృతిపై మమత స్పందన

నా సర్కారును కల్లోలపరిచ్దేఉకు మావోయిస్టుల కుట్ర
విధ్వంసానికి కిషన్‌జీ వ్యూహరచన.. మౌనంగా ఎలా ఉంటాం?
హక్కులపై నాకు పాఠాలు చెప్పొద్దు: ప్రజాస్వామ్యవాదులపై నిప్పులు
తృణమూల్ కూటమిలో భిన్నస్వరం.. స్వతంత్ర విచారణకు ఎస్‌యూసీఐ డిమాండ్
సంచలనం సృష్టించిన మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. మావోయిస్టు అగ్రనేతను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మమత హత్య చేయించారన్న ప్రజా సంఘాల ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చారు. ఎన్‌కౌంటర్‌ను తప్పించడానికి అన్ని ప్రయత్నాలను ప్రభుత్వం చేసిందని వివరించారు. లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినా కిషన్‌జీ, ఇతర మావోయిస్టు నేతలు తుపాకులు దించలేదని వెల్లడించారు. మూడురోజులు ఎదురుచూసినా స్పందన లేదని, పైగా సంయుక్త బలగాలపై ఎదురుదాడికి ప్రయత్నించారని, దీంతో ఎన్‌కౌంటర్ చేయక తప్పలేదని వివరించారు.

ఆదివారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ ర్యాలీలో మమత పాల్గొన్నారు. కిషన్‌జీని మమతే చంపించారన్న మావోయిస్టుల ఆరోపణలపై ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా స్పందించారు. "జంగల్‌మహల్‌ను బలగాలు దిగ్బంధించాయి. తుపాకులు అప్పగించి లొంగిపోవాలంటూ కిషన్‌జీకి, ఇతర నేతలకు మూడు రోజులు సమయమిచ్చాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు. పైగా బలగాలపైకి ఆ మూడు రోజుల్లో వెయ్యి రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ తప్ప మరే ప్రత్యామ్నాయం లేకుండా చేశారు'' అని వివరించారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌తో వందలాది మంది అమాయక ఆదివాసీలను రక్షించిన వాళ్లమయినట్టు పేర్కొన్నారు.

ఆ సమయంలో జంగల్‌మహల్‌లో కిషన్‌జీ నేతృత్వంలో భారీగా మావోయిస్టులు సమావేశమయ్యారని చెప్పారు. వారంతా కలిసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసకాండకు పాల్పడేందుకు, కొంతమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని, కోల్‌కతా మెట్రో రైల్వే స్టేషన్ సైతం వారి దాడి లక్ష్యాల్లో ఉన్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మౌనంగా ఉంటే మీరు సహిస్తారా అని గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. అయినా, కొంతమంది ఫిర్యాదుల మేరకు కిషన్‌జీ మృతిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్టు వివరించారు. వ్యక్తిగతంగా తనపైనా మావోయిస్టులు గురి పెట్టారని ఆరోపించారు.

" ప్రభుత్వాన్ని కల్లోలపరిచేందుకు ఉగ్రవాద చర్యలకు దిగారు. ఇలాంటివేవీ నన్ను కదిలించలేవు. ధైర్యేసాహసే.. అన్నట్టు జీవించడమే నాకు తెలుసు'' అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, విప్లవ సంఘాలపైనా మమత నిప్పులు చెరిగారు. తనకు ఎవరూ హక్కుల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాగా, కిషన్‌జీ మృతిపై తృణమూల్ కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని ఎస్‌యూసీఐ మమతని డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రజాస్వామ్యవాదుల ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, కిషన్‌జీతో పాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొని, త్రుటిలో తప్పిపోయినట్టు భావిస్తున్న మహిళా మావోయిస్టు సుచిత్రా మహతో కోసం సంయుక్త బలగాలు జంగల్‌మహల్‌ను జల్లెడ పడుతున్నాయి.

Read more ...

Nov 26, 2011

రామ్ చరణ్‌కు హెలికాప్టర్ గిఫ్ట్ అంతా అబద్ధం: ఉపాసన

వెబ్ దునియా తెలుగు నుండి:


మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అపోలో ఛారిటీ వైస్ ప్రెసిడెంట్ కామినేని ఉపాసనల నిశ్చితార్థం మరికొద్ది రోజుల్లో జరుగబోతోంది. ఇందుకుగాను భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నిశ్చితార్థం రోజున రామ్ చరణ్‌కు కామినేనివారు ఓ హెలికాఫ్టర్‌ను బహుమానంగా ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై ఉపాసన మాట్లాడుతూ.. అదంతా వట్టి అబద్ధం. చరణ్‌కు అటువంటి గిఫ్ట్‌లేమీ మా పేరెంట్స్ ఇవ్వడంలేదు. ఒకవేళ అలాంటి బహుమతులేమైనా మాకు ఇస్తామంటే తామిద్దరం కలిసి ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెపుతాం. అంతేతప్ప అలాంటి బహుమతులను రామ్ చరణ్ కానీ నేను కానీ స్వీకరించబోమని ఉపాసన చెప్పినట్లు సమాచారం. 

ఇక రామ్ చరణ్‌తో వివాహం చాలా సంతోషాన్ని కల్గిస్తోంది. నా చిన్ననాటి స్నేహితుడే కాబోయే భర్త కావడం చాలా ఆనందం కలుగుతోంది. సహజంగా పెళ్లితో స్త్రీ జీవితంలో మార్పు సంభవిస్తుందని అంటారు. మరి నా జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి అని చెపుతోంది ఉపాసన.
Read more ...

టాటా కంపెనీ రూపశిల్పులు

జంషెడ్‌జీ టాటా
jamshedjiభారతదేశంలో ఎంతో పేరున్న టాటా కంపెనీ ఇప్పటిది కాదు. 1868లో టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రారంభమైంది. అంటే 148 ఏళ్ల కిందట ప్రారంభమైంది. జంషెడ్‌జీ నస్సెర్‌వాన్‌జీ టాటా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. టాటా కంపెనీలకు ఆయన పితామహుడు. ఈరోజు టాటా ఇంతగా విస్తరించిందంటే అది ఆయన వేసిన పునాదివల్లే. 

దోరాబ్జీ టాటా
dorabjitata1టాటా గ్రూప్‌లో ఈయన టాటా స్టీల్‌, టాటా పవర్‌ సంస్థలను ప్రారం భించారు. టాటా గ్రూప్‌లో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే కీలకంగా ఉన్నా యి. ఒకవంక కొత్త కంపెనీలను ప్రారంభించడమే కాక, మరోవైపు భారత విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -ఐఐఎస్‌సి) ప్రారంభానికి ఆయన నిధులిచ్చి సహకరించారు. బెంగళూరు వెలుపల నెలకొన్న మొదటి పరిశోధనా సంస్థ ఇది. 

నౌరోజీ సక్లత్‌వాలా
past_chair_saklatvalaటాటా కుటుంబంతో సం బంధంలేని బయటి వ్యక్తి నౌరోజీ. సైరస్‌కు టాటాలతో దూరపు చుట్టరికం ఉన్నా, నౌరోజీకి అది కూడా లేదు. టాటా కుటుంబంతో సం బంధం లేకుండా ఆ గ్రూప్‌ నకు ఛైర్మన్‌ అయిన ఘనత ఈయనది. 

జహన్‌గీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా
jahangir-ratanjiటాటా కంపెనీల విస్తరణకు ఈయన ఎంతో కృషి చేశారు. నేడు ఉన్న అనేక టాటా కంపెనీలకు ఆయన పునాదులు వేశారు. జెఆర్‌డి టాటాగా ఈయన ప్రసిద్ధిచెందారు. జెఆర్‌డి టాటా కంపెనీకి వచ్చేనాటికి ఆ గ్రూప్‌లో 14 సంస్థలే ఉండేవి. వాటిని 95 సంస్థలుగా విస్తరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. జెఆర్‌డికి విమానయానమంటే మక్కువ. ఆ అభిరుచితో ఈయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి, ఎయిర్‌ ఇండియాగా మార్చింది. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌), టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సిపిఏ)లను జెఆర్‌డి నెలకొల్పారు. 


రతన్‌ టాటా
Ratan-Tataaటాటాకు ఉన్న వివిధ కంపెనీల బిజినెస్‌ను ఈయన విస్తరించారు. మొదట ఇండియాకే పరిమితమైన అనేక టాటా కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. అంతర్జాతీయ రంగంలో టాటాకు సముచిత స్థానాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలను తీర్చిదిద్దారు. 

బాంబే హౌస్‌ 
bombay_house_tataటాటా గ్రూప్‌ ప్రధాన కేంద్రం బాంబే హౌస్‌. 87 ఏళ్ల నాటి బాంబే హౌస్‌ టాటా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌. గత ఇరవై ఏళ్లలో అంటే...రతన్‌ టాటా టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాక బాంబే హౌస్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆయన బాంబే హౌస్‌లో మార్పులు చేయాల నుకున్నారు. చేశారు. అంతకుముందు జెఆర్‌డి టాటా హ యాం స్వర్ణయుగంగా భాసిందని చెప్పేవారు రతన్‌ వచ్చి చేసిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోయారు.

ఆయన పగ్గాలు చేపట్టగానే, ప్రక్షాళన ప్రారంభించారు. అక్కడి పాత కాపులకు, వృద్ధతరానికి ఆయన ఉద్వాసన పలికారు. ఆ చర్య చాలామందికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. నిన్నమొన్న వచ్చిన రతన్‌ ఈ మార్పులు ఎలా చేయగలరు? అంతకు ముందు జెఆర్‌డి హయాంలో ఇలాంటిది కనీవినీ ఎరగం’ అన్నారు. తనపై వచ్చిన విమ ర్శలకు రతన్‌ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆయ నపై అనుమానాలూ వచ్చాయి. ఎప్పటినుంచో ఉన్నవారిని తొలగించి విమర్శలకు గురైన రతన్‌ ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మొదట కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, తర్వాత ప్రశంసలు పొందారు. అలాగే, నానో కారు కూడా బాంబే హౌస్‌ నుంచి వచ్చిందే. ఇది టాటా సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టింది. నానో కారు పూర్తిగా రతన్‌ టాటా ఆలోచనే అంటారు. ఇది సా మాన్య ప్రజల్లో మొదట్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్ష ల్లోనే ఆర్డర్లు వచ్చాయి. కానీ, ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. కార్ల ఉత్పత్తిరంగంలో టాటా సుస్థిరస్థానాన్ని సంపాదిం చడానికి రతన్‌టాటాయే కారణమనడంలో సందేహం లేదు. 

టాటాకు యువకోణం
cyrus-pallonjiరతన్‌జీ టాటా వారసుడిగా సైరస్‌ కొత్తగా రంగంమీద కనిపిస్తున్నా ఆయనకు టాటా ఆధిపత్యం కట్టబెట్టాలన్న ఆలోచన కొన్నేళ్ల కిందటే వచ్చింది. సమర్థులైన యువతరం వారికి టాటా సారథ్యాన్ని అందివ్వాలని రతన్‌ టాటా అనుకున్నారు. ఆ ఆలోచ నతోనే టాటా కంపెనీల్లో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఏళ్ల ఆర్‌ ముకుందన్‌ను 2008లో టాటా కెమికల్స్‌కు సిఈఓను చేశారు. 2009లో ఎన్‌ చంద్రశేఖరన్‌ను టిసిఎస్‌కు సీఈఓగా నియమించారు. అప్పుడాయన వయసు 46. అలాగే 2008లో టాటా టెలీసర్వీసెస్‌కు సారథిగా నియమితులైనప్పుడు ముకుంద్‌ రాజన్‌ వయసు కేవలం 40 ఏళ్లు. 

టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది. 

మరి మిస్ర్తీ ఏమంటారు?
రతన్‌జీ మాదిరిగానే సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ కూడా ఆలోచి స్తారా? అన్న సందేహం కలగడం సహజం. టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్ని యువతకు కట్టబెట్టడంలో సైరస్‌ పాత్ర కూడా ఉందని ఆయనను టాటా సామ్రాజ్యానికి సారథిగా ఎంపిక చేసిన అయిదుగురి కమిటీలో ఒక సభ్యుడు తెలిపారు. టాటా కంపెనీ ల్లో యువరక్తాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన సైరస్‌కూడా ఉందని ఆయన అన్నారు. ఇతర కంపెనీల్లో సమర్థులైన వారిని తమ కంపెనీల సీఈఓలుగా, టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డులో నియమిం చడం సాధారణంగా జరుగుతూ వస్తున్నదే. ‘యువనాయకత్వం సంస్థకు యవ్వనాన్నిస్తుంది. 

కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు సారథ్యం వహించినప్పుడు యువకులకు ప్రాధాన్య మిచ్చారు. మిస్ర్తీ సారథ్యాన్ని స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో కూడా అదే జరుగుతుంది. యువతకు ప్రాధాన్యమిస్తారు’ అని ఏబీసీ కన్సల్టెంట్‌ సీఈఓ శివ్‌ అగర్వాల్‌ అన్నారు.మిస్ర్తీకి టాటా గ్రూప్‌లో అత్యున్నత పదవినిచ్చి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారనవచ్చు. మిస్ర్తీకి కలిసొచ్చే మరొక అంశం ఏమిటంటే, ఇప్పటికే టాటాకు చెందిన అనేక సంస్థల్లో యువకులే కీలక పదవుల్లో ఉన్నారు కనుక, వారితో పని తీసుకోవడం సులభతరమవుతుంది.

వయసు మీరిన వారూ ఉన్నారు
యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న మాట నిజమే అయినా, దీనికి వ్యతిరేకమైన మరో వాదం కూడా వినిపిస్తోంది. టాటా సన్స్‌ డైరెక్టర్లలో ఆయన మాత్రమే 50 ఏళ్ల లోపు వారనీ, మిగతా వారు కనీసం పదేళ్లు పెద్దవారనీ అంటున్నారు. గ్రూప్‌లో టాప్‌లో ఉన్న అయిదు కంపెనీ బోర్డుల్లో దాదాపు 50 మంది డైరెక్టర్లున్నారు. వారిలో 70 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారే. 

ఎవరీ సైరస్‌ ?
pallonjiటాటా గ్రూప్‌ సంస్థలకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ పల్లోంజీ కుటుంబానికి చెందినవారు. 2012 డిసెంబర్‌లో రతన్‌ టాటా నుంచి అధికార పగ్గాలు స్వీకరిస్తారు. మిస్ర్తీ అంటే ఎవరో ఇప్పటివరకు..అంటే టాటా గ్రూప్‌నకు రతన్‌ వారసుడిగా ఎంపికయ్యే వరకు చాలా మందికి తెలీదు. పారిశ్రా మిక మహాసామ్రాజ్యం షాపూర్జీ పల్లోంజీ సంస్థ (ఎస్‌పి) అధిపతి షాపూర్జీ పల్లోంజీ కుమారుడు. షాపూర్జీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు షాపూర్‌, సైరస్‌. కుమార్తెలు లైలా, అలూ. ఫోర్బ్స్‌ మాగజైన్‌ అంచనా ప్రకారం షాపూర్‌జీకి 2011 నాటికి ఉన్న సంపద విలువ 8.8 బిలియన్‌ డాలర్లు అంటే రూ 45,760 కోట్లు. రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ 1968 జూలై 4న పుట్టారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ నుంచి బిఇ సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు.

లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌లో ఫెలో.సైరస్‌ ఇదివరకు టాటా సన్స్‌, టాటా ఎల్‌క్సిసి (ఇండియా)కు డైరెక్టర్‌గా పనిచేశారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ, ఫోర్బ్స్‌ గోకక్‌, అఫ్‌కాన్స్‌ ఇన్‌ఫ్రా, యునైటెడ్‌ మోటార్స్‌ (ఇండియా)తో సహా అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ 1991లోనే షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు. బుధవారం టాటా గ్రూప్‌నకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన తర్వాత సైరస్‌ ఒక ప్రకటన చేస్తూ- తను టాటా సంస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చట్టబద్ధంగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

టాటా గ్రూప్‌తో అనుబంధం
పల్లోంజీ కుటుంబానికి టాటా సంస్థతో అనుబంధం బంధుత్వంతో ఏర్పడింది. షాపూర్‌జీ కుమార్తె అలూ రతన్‌ టాటాకు సోదరుడి వరసయిన నోయల్‌ టాటాను వివాహమాడింది. ఆ రకంగా టాటా సామ్రాజ్యంతో పల్లోంజీ కుటుంబానికి అనుబంధం ఏర్పడింది.
thetata
Read more ...

'అధికారం ఇస్తే ప్రధానిని ఉరితీయిస్తా’ కె.నారాయణ


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
తనకే అధికారం ఉంటే.. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధానమంత్రిని కరెంటు స్తంభానికి కట్టి ఉరితీయించేవాడినని భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.నారాయణ అన్నారు. చోడవరంలో శనివారం సీపీఐ 21వ జిల్లా మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, బడా సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్రం గిరిజ నులను, మత్స్యకారులను, ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందన్నారు. 

బాక్సైట్, చైనాక్లే గనులకు అనుమతి ఇవ్వడంతోపాటు వాల్‌మార్ట్ వంటి సంస్థలను దేశంలోకి రానిస్తున్న ప్రధానమంత్రిని, తనకేగాని అధికారం ఉంటే ఉరి తీయించే వాడినన్నారు. బెంగాల్‌లో 34ఏళ్ల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడానికి సహకరించిన మావోయిస్టులు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారన్నారు. మావోయిస్టు నేత కిషన్‌జీని బెంగాల్ ప్రభుత్వమే హత్య చేయించిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Read more ...

'చంపేంత కసి'తో పాడిన పాట!


 తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు అటు హీరోగానే కాకుండా, ఇప్పుడు పాటల రచయితగా, గాయకుడుగా కూడా సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న '3' సినిమా కోసం ఆయనే స్వయంగా రాసుకుని పాడిన 'వై దిస్ కొలవెరి...' పాట యువతను ఇప్పుడు ఊపేస్తోంది. ఇంటర్నెట్ లో ఈ పాట ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని ఇటీవలే యూ ట్యూబ్ లో పెట్టారు. ఆంగ్లం, తమిళం కలగలిసిన ఈ 'కొలవెరి' పాట అందర్నీ ఉర్రూతలూగిస్తోంది. యూ ట్యూబ్ లో పెట్టి పది రోజులు కూడా కాకుండానే, ఈ పాటకు నలభై లక్షల క్లిక్స్ వచ్చాయి. కేవలం అభిమానులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఈ పాట ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ 'కొలవెరి' అన్న తమిళ పదానికి అర్ధం తెలుసా... 'చంపేంత కసి' అని అర్ధమట. అందుకే ఇది అందర్నీ తీపిగా చంపేస్తోంది!
 
Read more ...

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు భారత్ జట్టు ఎంపిక


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:


ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక ఖరారైంది. 17 మంది సభ్యుల బృందాన్ని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. విండీస్ తో జరుగుతున్న టెస్ట్ ల్లో అద్భుతంగా రాణిస్తున్న ఓజా, అశ్విన్ లకు స్థానం దక్కగా, యువరాజ్, హర్భజన్ సింగ్ లకు మరోసారి నిరాశే మిగిలింది. జహీర్ ఖాన్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. రిజర్వ్ వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సహాకి సెలక్షన్ టీమ్ అవకాశం కల్పించింది.

జట్టు వివరాలు : ఎంఎస్ ధోని (కెప్టెన్&కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ, అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ అరోరా, రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్, రహానే, వృద్ధిమాన్ సహా, జహీర్ ఖాన్.
Read more ...

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఐశ్వర్య

మొన్న పదహారవ తేదిన ఒక అందమయిన పాపాయికి జన్మనిచ్చిన అందాల సుందరి ఐశ్వర్య బచ్చన్ సెవెన్ హిల్స్ ఆసుపత్రినుండి డిశ్చార్జ్ అయింది. ఆమె పాపని ఎత్తుకొని ఉండగా తీసిన ఫోటో అని ఒకటి నెట్ లో పెట్టబడింది. అయితే, 'అది తమ పాపది కాదని, ఇంతవరకు పాప ఫోటో ఎవరికీ ఈయలేదని' అమితాబచ్చన్ స్వయంగా తన బ్లాగులో వ్రాసారు. అంతే గాక, అంట బాగా మార్ఫ్ చేసిన ఫోటో పెట్టిన వారు చాల నీట్ గా చేసి అందరిని చాల చక్కగా భ్రమిమ్పజేసారు అని కూడా వ్రాసారు. (ఆ ఫోటోని నేనుకూడా ఈ బ్లాగులోపెట్టినా, అది నకిలీదని తెలిసి తొలగించెను.) అమితాబచ్చన్ తన మనుమరాలిని ఎత్తుకొని ఆసుపత్రినుండి బయటికి వెళ్తునప్పుడు తీసిన ఫోటో ఒకటి మళ్లీ దొరికి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇదయిన నిజమయిన ఫోటో అని భావిస్తున్నాను.

అమితాబచ్చన్ తన మనుమరాలి గురించి తన బ్లాగులో నిత్యం చాల కబుర్లే వ్రాస్తున్నపటికీ, పాప ఫోటోని మాత్రం  మీడియా చేతికి చిక్క కుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళ గురించి ప్రజలకి సహజంగా ప్రత్యెక ఆసక్తి ఉంటుంది. అందువల్ల, అమితాబ్ కుటుంబము పాప విషయంలో ఎంత గోప్యత పాటిస్తే, మీడియా కూడా అంతే క్రియేటివిటి చూపిస్తూ రకరకాల వార్తలు, ఫోటోలు ప్రాచుర్యంలోకి తెస్తుంది. అప్పుడు, నిత్యం ఇలా ఖండన ముండనాలు చేయడం కన్నాపాప ఫోటో మీడియాకి ఇచ్చేసి ఈ తలనొప్పులకి ఇంతటితో ముగింపు పలకడమే మంచిదని అమితాబ్ కుటుంబం అనుకోక తప్పదు.
Read more ...

Nov 25, 2011

కేవీపీ వియ్యంకుడు రఘురాజ్ ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు


ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:

వలలో కేవీపీ వియ్యంకుడు
ఎమ్మార్‌లో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు
అడ్డంగా దొరికిన ఆత్మ.. బంధువు రఘురాజ్

పిలిచి ప్రశ్నించిన సీబీఐ అధికారులు
గజం 5 వేలకే కొన్నానంటూ వాదన
ఐటీ సోదాల్లో 110 కోట్ల 'బ్లాక్ మనీ' పట్టివేత
అల్లిబిల్లి కంపెనీల ద్వారా ధన ప్రవాహం
సహ నిందితుడిగా చేర్చే అవకాశం!
ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లో విల్లా! లేదా... ప్లాటు! అదో స్టేటస్ సింబల్. సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులకు మినహా ఇతరులకు అక్కడ 'ప్రవేశం లేదు'. కోట్లకు పడగలెత్తిన వారు సైతం... 'మాకో ప్లాటు ఇప్పించండి' అంటూ భారీ స్థాయిలో పైరవీలు నడిచిన కాలం! అలాంటిది... ఒకే ఒక వ్యక్తికి ఒక విల్లా, నాలుగు ప్లాట్లు దక్కాయి. అడ్వాన్సు కూడా చెల్లించకుండానే విల్లా బుక్కయిపోయింది. ఇంత ఘనత దక్కింది ఎవరికో కాదు! ఆయన పేరు రఘు రామ కృష్ణంరాజు. ఆయన... వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవీపీకి స్వయానా వియ్యంకుడు. ఇప్పుడు ఎమ్మార్ అక్రమాల కేసులో రఘురాజు అడ్డంగా ఇరుక్కున్నారు. ఆయనను సహ నిందితుడిగా కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఆయనను మనీ లాండరింగ్ వివాదం కూడా చుట్టుముడుతోంది.

హైదరాబాద్: బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టులో రఘురాజు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నాయి. ఆయన నుంచి ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండానే 1487 చదరపు గజాల విల్లాను (ఏ727) కేటాయించారు. తర్వాత 2005లో 1262 చదరపు గజాలు, 2009 అక్టోబర్‌లో 1485, 2010 ఫిబ్రవరిలో 1870, ఆ తర్వాతి నెలలోనే 1416 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్లు 'కొన్నారు'. ఈ వ్యవహారం అత్యంత నాటకీయంగా బయటపడింది. కొన్ని రోజుల క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు రఘు రాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఏకంగా 30 కోట్ల రూపాయల లావాదేవీలకు లెక్క తేలలేదు. అధికారులు దీనిని బ్లాక్ మనీగా గుర్తించడంతో... ఈ వ్యవహారాన్ని మరింత తవ్వి తీయకుండా ఉండేందుకు అప్పటికప్పుడు రూ.30 కోట్లకు పన్ను కట్టేందుకు రఘు రాజు అంగీకరించారు. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న రికార్డులను, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం... 'ఇంకా ఏదో ఉంది' అనే అనుమానంతో ఐటీ అధికారులు మరోసారి రఘురాజు నివాసంపై దాడులు చేశారు. ఈసారి ఏకంగా 80 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వివరాలు బయటపడ్డాయి. అంతేకాదు... మరిన్ని ఆసక్తికర సంగతులూ వెలుగు చూశాయి.

వైఎస్ జగన్ సంస్థల్లో కోల్‌కతాకు చెందిన అల్లిబిల్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లే... రఘు రాజు కంపెనీల్లోకి కూడా డబ్బులు ప్రవహించినట్లు గుర్తించారు. రఘురాజు కుమార్తె ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులకు ప్రయత్నించినప్పటికీ... ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఆగిపోయినట్లు సమాచారం. రఘు రాజు వద్ద ఏకంగా రూ.110 కోట్ల బ్లాక్ మనీ వివరాలు బయటపడటం, ఆయనకు ఎమ్మార్‌లో విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నట్లు తెలియడంతో దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రఘు రాజును పిలిచి ప్రశ్నించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు ఆయన మహా పెడసరంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. 'నేను చదరపు గజం ఐదు వేలకే కొన్నాను. బ్లాక్‌లో ఏమీ ఇవ్వలేదు' అని చెప్పినట్లు సమాచారం.

'అన్ని ప్లాట్లు ఎలా వచ్చాయి? కేవీపీ బంధువు కావడంవల్లే ఇచ్చారా?' అని ప్రశ్నించగా... 'కేవీపీతో సంబంధంలేదు. ప్లాట్లు నన్ను చూసే ఇచ్చారు' అని పేర్కొన్నారు. 'గజం 50 నుంచి 60 వేల రూపాయల ధర ఉన్న బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టులో మీకు గజం ఐదు వేలకే ఎందుకు ఇచ్చారు? బ్లాక్‌లో అదనంగా చెల్లించారా? లేక... గుడ్‌విల్‌గా పొందారా?' అని ప్రశ్నించినా... రఘురాజు 'లేదు. నాకు ఐదువేలకే ఇచ్చారు. బ్లాక్‌లో కట్టలేదు. గుడ్‌విల్ సంగతి తెలియదు. కేవీపీతో సంబంధం లేదు' అనే బదులిచ్చినట్లు తెలిసింది.

నిజానికి... ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలు కొన్న వారిలో సుమారు నలభై మంది తాము అధికారికంగా ఐదు వేల రూపాయలు చెల్లించి.... మిగిలింది బ్లాక్‌లో ఇచ్చినట్లు అంగీకరించారు. అంతేకాదు... ఈ లావాదేవీలు నడిపిన 'స్టైలిష్' రంగారావు కూడా రఘు రాజు నుంచి బ్లాక్‌లో సొమ్ము తీసుకున్నట్లు సీబీఐకి చెప్పినట్లు తెలిసింది. అలాగే... రాజకీయ నాయకులకు మాత్రం 'గుడ్‌విల్'గా చదరపు గజం రూ.5 వేలకే విక్రయించినట్లు ఈ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ అంగీకరించినట్లు సమాచారం. వీటన్నింటిని బట్టి చూస్తే... రఘు రాజు అబద్ధం చెబుతున్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మార్ కేసులో సహనిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. జగన్ తరహాలోనే రఘు రాజు కంపెనీల్లోకి కూడా మనీలాండరింగ్ ద్వారా నిధులు వచ్చినట్లు తెలియడంతో సీబీఐ దీనిపైనా దృష్టి సారించింది. విల్లాల అసలు ధర విషయంలో సహకరించకపోవడం, మహా నిర్లక్ష్యంగా, పెడసరంగా సమాధానాలు చెప్పడంతో రఘు రాజు విషయాన్ని సీబీఐ 'సీరియస్'గా తీసుకున్నట్లు తెలి
Read more ...