సత్యసాయిబాబా అసలు ఎప్పుడు మరణించారు. సాయి ట్రస్టు, సత్యసాయి ఆస్పత్రి వైద్యులు చెప్పినట్టు ఈ నెల 24వ తేదీ ఉదయం 7 గంటల 40 నిముషాలకు మరణించారా ? లేక మార్చి 28న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన ఒకటి రెండు రోజులకే మరణించారా? బాబా ఎప్పుడో మరణించినప్పటికీ సత్యసాయి ట్రస్టు వివాదాల వల్లనే ఇంతకాలం బాబా కొన ఊపిరితో ఉన్నట్లు నాటకాలు ఆడారా? కోట్లాది భక్తులకు నిరంతరం సత్యం గురించి బోధించిన సాయిబాబా మరణానికి సంబంధించిన వాస్తవాలను ‘మహా సమాధి’ చేశారా? బాబా నిర్యాణం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన శీతల శవపేటిక (ఫ్రీజర్) ఎప్పుడు తయారు చేయించారన్న విషయంపై తాజాగా వివాదం చెలరేగడం అనుమానాలకు తావిస్తోంది. బాబా మార్చి 28న ఆస్పత్రిలో చేరగా ఏప్రిల్ మూడోతేదీ గాని బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు. మూడో తేదీనే బాబా మరణించారన్న వార్తలు గుప్పుమనడం, అప్పటికే పుట్టపర్తికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకోవడం గమనార్హం. బాబా ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే శవపేటిక తయారీకి ఎందుకు ఆర్డరు ఇచ్చారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బాబా మరణం, శవపేటికకు సంబంధించి కన్నడ టీవీ చానళ్ళు బుధవారం ఉదయం నుంచి చేస్తున్న ప్రసారాలు కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి.
అనారోగ్యంతో బాబా మార్చి 28న సత్యసాయి ఆస్పత్రిలో చేరగా రెండు రోజులకే అంటే మార్చి ముప్పయ్యో తేదీనే ఫ్రీజర్ తయారీకి బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వడం చూస్తే అప్పటికే మరణించారా లేక ఇక ఒకటి రెండు రోజుల్లో మరణిస్తారన్న ఉద్దేశంతో ఫ్రీజర్ తయారీకి ఆర్డర్ ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాబా భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ను తయారు చేసిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలను కన్నడ టీవీ చానళ్ళు ఉదయ, సమయ ప్రసారం చేస్తున్న అంశాలు తాజా వివాదానికి కారణమయ్యాయి.
మార్చి 28న బాబా ఆస్పత్రిలో చేరగా మార్చి ముప్పయ్యో తేదీన కర్నాటకలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శవ పేటికల తయారీ సంస్థకు కర్నాటకలోని రాజేంద్రనాథ్ అనే సాయిసేవా సమితి ప్రతినిధి శవపేటికకు ఆర్డర్ ఇచ్చి యాభై వేల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఏప్రిల్ నాలుగో తేదీన సాయి ట్రస్టు ప్రతినిధులు మళ్ళీ ఆ సంస్థకు ఫోన్ చేసి తమకు ఏడో తేదీ కల్లా శవపేటిక కావాలని వత్తిడి తెచ్చారు. శవపేటికను తయారు చేసేందుకు తమకు కనీసం నెల రోజుల సమయమైనా కావాలని, శవపేటికలో ఉంచే భౌతిక కాయం చెడిపోకుండా ప్రత్యేక రసాయనాలను వాడాల్సి ఉంటుందని ఆ సంస్థకు చెందిన కుమార్ అనే వ్యక్తి ట్రస్టు సభ్యులకు తెలియజేశారు. తమకు అంత సమయం లేదని వెంటనే కావాలని ట్రస్టు సభ్యులు వత్తిడి తెచ్చారు. అలా అయితే తమ వద్ద ఒక శవపేటిక సిద్ధంగా ఉందని, కన్నడ కంఠీరవగా పేరొందిన ప్రముఖ సినీ నటుడు రాజ్కుమార్ మరణించినప్పుడు శవపేటికను తయారు చేసినట్లు ఎలక్ట్రిక్ షాక్ కొడుతోందన్న కారణంగా దాన్ని తిప్పి పంపించేశారని, త్వరగా కావాలంటే దానికి మరమ్మతు చేసి పంపిస్తామని బెంగళూరుకు చెందిన సంస్థ ప్రతినిథి కుమార్ చెప్పారు. అందుకు ట్రస్టు ప్రతినిధులు అంగీకరించడంతో రాజ్కుమార్ కోసం తయారు చేసిన శవపేటికకు మరమ్మతు చేసి ఏప్రిల్ ఐదో తేదీనే పుట్టపర్తికి పంపించారు. ఆ సంస్థ ప్రతినిధి కుమార్కు, సాయి ట్రస్టు ప్రతినిధులకు మధ్య జరిగిన ఈ సంభాషణను కన్నడ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. శవపేటిక తయారీకి సాయి ట్రస్టు ఇచ్చిన ఆర్డరు రశీదులను కూడా ఆ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి.
బాబా భౌతిక కాయాన్ని ఉంచిన శీతల శవపేటికకు సాయి ట్రస్టు లోగో ఉన్న స్టిక్కర్లను అతికించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ ఐదో తేదీనే గుట్టు చప్పుడు కాకుండా శీతల శవపేటికను పుట్టపర్తికి చేర్చారు. ట్రస్టు సభ్యులు చెప్పినట్లు బాబా 24వ తేదీ ఉదయం మరణించినట్లు చెప్పగానే సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు చేరారు. ఒకవేళ బాబా మరణించిన తర్వాతే శీతల శవపేటికను తయారు చేయించినట్లయితే అంతమంది భక్తుల కళ్ళుగప్పి దాన్ని ఆస్పత్రి లోపలికి ఎలా తీసుకువెళ్ళారన్నది ప్రశ్న. పూర్తిగా బంగారు పూతతో ఉన్న ఆ శవపేటిక తయారీకి ఎంత లేదన్నా ఇరవై రోజుల సమయం పడుతుందని, అప్పటికప్పుడు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.
అనారోగ్యంతో బాబా మార్చి 28న సత్యసాయి ఆస్పత్రిలో చేరగా రెండు రోజులకే అంటే మార్చి ముప్పయ్యో తేదీనే ఫ్రీజర్ తయారీకి బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వడం చూస్తే అప్పటికే మరణించారా లేక ఇక ఒకటి రెండు రోజుల్లో మరణిస్తారన్న ఉద్దేశంతో ఫ్రీజర్ తయారీకి ఆర్డర్ ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాబా భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ను తయారు చేసిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలను కన్నడ టీవీ చానళ్ళు ఉదయ, సమయ ప్రసారం చేస్తున్న అంశాలు తాజా వివాదానికి కారణమయ్యాయి.
మార్చి 28న బాబా ఆస్పత్రిలో చేరగా మార్చి ముప్పయ్యో తేదీన కర్నాటకలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శవ పేటికల తయారీ సంస్థకు కర్నాటకలోని రాజేంద్రనాథ్ అనే సాయిసేవా సమితి ప్రతినిధి శవపేటికకు ఆర్డర్ ఇచ్చి యాభై వేల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఏప్రిల్ నాలుగో తేదీన సాయి ట్రస్టు ప్రతినిధులు మళ్ళీ ఆ సంస్థకు ఫోన్ చేసి తమకు ఏడో తేదీ కల్లా శవపేటిక కావాలని వత్తిడి తెచ్చారు. శవపేటికను తయారు చేసేందుకు తమకు కనీసం నెల రోజుల సమయమైనా కావాలని, శవపేటికలో ఉంచే భౌతిక కాయం చెడిపోకుండా ప్రత్యేక రసాయనాలను వాడాల్సి ఉంటుందని ఆ సంస్థకు చెందిన కుమార్ అనే వ్యక్తి ట్రస్టు సభ్యులకు తెలియజేశారు. తమకు అంత సమయం లేదని వెంటనే కావాలని ట్రస్టు సభ్యులు వత్తిడి తెచ్చారు. అలా అయితే తమ వద్ద ఒక శవపేటిక సిద్ధంగా ఉందని, కన్నడ కంఠీరవగా పేరొందిన ప్రముఖ సినీ నటుడు రాజ్కుమార్ మరణించినప్పుడు శవపేటికను తయారు చేసినట్లు ఎలక్ట్రిక్ షాక్ కొడుతోందన్న కారణంగా దాన్ని తిప్పి పంపించేశారని, త్వరగా కావాలంటే దానికి మరమ్మతు చేసి పంపిస్తామని బెంగళూరుకు చెందిన సంస్థ ప్రతినిథి కుమార్ చెప్పారు. అందుకు ట్రస్టు ప్రతినిధులు అంగీకరించడంతో రాజ్కుమార్ కోసం తయారు చేసిన శవపేటికకు మరమ్మతు చేసి ఏప్రిల్ ఐదో తేదీనే పుట్టపర్తికి పంపించారు. ఆ సంస్థ ప్రతినిధి కుమార్కు, సాయి ట్రస్టు ప్రతినిధులకు మధ్య జరిగిన ఈ సంభాషణను కన్నడ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. శవపేటిక తయారీకి సాయి ట్రస్టు ఇచ్చిన ఆర్డరు రశీదులను కూడా ఆ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి.
బాబా భౌతిక కాయాన్ని ఉంచిన శీతల శవపేటికకు సాయి ట్రస్టు లోగో ఉన్న స్టిక్కర్లను అతికించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ ఐదో తేదీనే గుట్టు చప్పుడు కాకుండా శీతల శవపేటికను పుట్టపర్తికి చేర్చారు. ట్రస్టు సభ్యులు చెప్పినట్లు బాబా 24వ తేదీ ఉదయం మరణించినట్లు చెప్పగానే సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు చేరారు. ఒకవేళ బాబా మరణించిన తర్వాతే శీతల శవపేటికను తయారు చేయించినట్లయితే అంతమంది భక్తుల కళ్ళుగప్పి దాన్ని ఆస్పత్రి లోపలికి ఎలా తీసుకువెళ్ళారన్నది ప్రశ్న. పూర్తిగా బంగారు పూతతో ఉన్న ఆ శవపేటిక తయారీకి ఎంత లేదన్నా ఇరవై రోజుల సమయం పడుతుందని, అప్పటికప్పుడు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.

వీటితో పాటు ప్రసిద్ద పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పుణ్య జలం, దేశ విదేశాల నుంచి పుష్పాలను ట్రస్టు తెప్పించింది. సమాధిని నాలుగు వైపులా పాలరాతితో నిర్మించారు. ఇందులో కింది భాగంలో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన మట్టిని, పుణ్య జలాన్ని చల్లుతారు. అనంతరం బాబా పార్థివ దేహానికి దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తెప్పించిన జలంతో పుణ్య స్నానం చేయిస్తారు. మంగళ స్నానం అనంతరం ప్రతి రోజూ బాబా భక్తులకు దర్శనమిచ్చే వేళలయిన ఏడు గంటలకు దర్శనం ఏర్పాటు చేసి, ఎనిమిది గంటల నుంచి భజనలు, కీర్తనలు మొదలు పెడతారు. తొమ్మిది గంటల నుంచీ వేద పండితులు, వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతుల వేద మంత్రోఛ్చారణల మధ్య హారతి ఇచ్చి బాబా పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. మొత్తం వ్యవహారమంతా పది గంటల లోపే పూర్తవుతుంది.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచీ బాబా సమాధి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇలా రెండు రోజుల పాటు దర్శనం కలిగించిన తరువాత కొన్ని రోజుల పాటు సమాధి దర్శనాన్ని ఆపి వేస్తారు. సమాధిని పూర్తీగా నిర్మిచేంత వరకూ బాబా సమాధి దర్శనానికి అనుమతి లేదు. బాబా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు 950 మందికి మాత్రమే అనుమతి ఉంది. అంత్యక్రియలకు దేశంలోని ప్రముఖ వేద పండితులతో పాటు దేశంలోని వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు కూడా పాల్గొననున్నారు. వీరిలో కంచి, శృంగేరి పీఠాలకు చెందిన పీఠాధిపతులు, విజయేంద్ర సరస్వతి, విద్యాభారతి, గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు ఉన్నట్లు సమాచారం.
అనంతపురం, మేజర్న్యూస్: సత్యసాయి పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి పుట్టపర్తికి భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులు బాబాను కడసారి దర్శించుకోవడానికి పుట్టపర్తికి చేరుకున్నారు. దీంతో పుట్టపర్తి జనసంద్రంగా మారింది. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. వారి నోటి వెంట నిరంతరం బాబా నామస్మరణ వినిపించింది. పేద, ధనిక, చిన్నా, పెద్దా, వృద్దులు, స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాబా పార్థివ దేహ కడసారి దర్శనం కోసం ఎంతో ఆతృతగా పుట్టపర్తికి వస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకే దర్శనం అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. భక్తుల తాకిడిని గమనించిన ట్రస్టు సభ్యులు రాత్రి 12 గంటల వరకూ దర్శనానికి గడువు పొడిగించారు.
ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఐదు కిలోమీటర్ల మేర క్యూ కనిపించింది. ఇంత దూరం క్యూ ఉన్నా కూడా భక్తుల్లో ఎలాంటి అలసట కనిపించకపోవడం గమనార్హం. బాబా పార్థివ దేహాన్ని దర్శించుకోవడమే తమ లక్ష్యమన్నట్లుగా వారు కనిపించారు. రద్దీ అధికమవుతున్నా కూడా బాబాను కడసారి చూసేందుకు కొందరు రెండు, మూడు సార్లు గంటల కొద్దీ క్యూలో నిల్చుని దర్శనానికి రావడం కనిపించింది. మంగళవారం ఒక్కరోజే దాదాపుగా ఐదు లక్షల మంది వరకూ బాబా పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే పుట్టపర్తికి భక్తుల తాకిడి మొదలయ్యింది. జిల్లాలోని బాబా భక్తులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశ విదేశాలకు చెందిన భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడింది.
పుట్టపర్తి, మేజర్న్యూస్: బాబా పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి మంగళవారం పుట్టపర్తికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యుపిఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీలు ప్రత్యేకంగా శాంతి సందేశాన్నిచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వారు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని శాంతి భవన్కు చేరుకున్నారు.
అనంతపురం, మేజర్న్యూస్: బాబా అద్వి తీయమైనశక్తి అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి కొనియాడారు. సత్యసాయి ట్రస్ట్ అతిపెద్ద ధార్మిక సంస్థ అని సత్మసాయి బాబా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు ముందుకు వెళ్తాయని, సత్యసాయి బాబా పార్థివదేహాన్ని దర్శించు కొనేందుకు మంగళవా రం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హిందూధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అన్నారు. ప్రపంచానికే మార్గనిర్దేశం చేసిన ధార్మికవేత్త బాబా అన్నారు. మనుషులు ఇంతపెద్ద వ్యవస్థను నిర్మించలేరన్నారు. బాబా ప్రత్యేకశక్తి వలనే ఇది సాధ్యమైందన్నారు.









































































